Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన సాయిదత్త పీఠం

బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన సాయిదత్త పీఠం
, శనివారం, 11 డిశెంబరు 2021 (09:51 IST)
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది.

 
బిపిన్ రావత్‌తో పాటుగా సైన్యంలో సేవలందించిన కల్నల్(రిటైర్డ్ ) వీరేంద్ర ఎస్ తవాతియా, రావత్‌తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు.

 
ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయిదత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌, వారి సతీమణి మధులికతో పాటు మిగిలిన సైనికులకు కూడా అందరూ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘుశర్మ శంకరమంచి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో తీసుకోవాల్సిన పండ్లు