Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌య‌తే కూచిపూడి కోసం లండ‌న్ చేరుకున్న ప‌వ‌ర్ స్టార్

లండ‌న్ : యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా), భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య (ఐసిసిఆర్), భారతీయ విద్యా భవన్, నెహ్రూ సెంటర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జయతే కూచిపూడి" పండుగ ముగింపు దశకు చేరుతోంది. 45 మంది కళాకారుల బృందం యూరప్ లోని ఇ

జ‌య‌తే కూచిపూడి కోసం లండ‌న్ చేరుకున్న ప‌వ‌ర్ స్టార్
, శనివారం, 9 జులై 2016 (13:42 IST)
లండ‌న్ : యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా), భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య (ఐసిసిఆర్), భారతీయ విద్యా భవన్, నెహ్రూ సెంటర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జయతే కూచిపూడి" పండుగ ముగింపు దశకు చేరుతోంది. 45 మంది కళాకారుల బృందం యూరప్ లోని ఇటలీ, ఫ్రాన్స్  జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ దేశాల్లో నెల రోజులపాటు కూచిపూడి, యక్షగానం, బతుకమ్మ నీరాజనం, తెలంగాణ జానపదం వంటి ప్రదర్శనలిచ్చేందుకు లండన్ నగరం చేరుకుంది. 
 
తూర్పు లండన్‌లో ఉన్న ట్రాక్సీ థియేటర్‌లో జరిగిన యుక్తా వార్షికోత్సవ వేడుకలలో ఈ బృందాన్ని ఘనంగా సన్మానించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత సినీ నటుడు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజ‌ర‌య్యారు. నిన్న ప‌వ‌న్ లండ‌న్ చేరుకుని, రెండువేల మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్న ఈ వేడుక‌ల్లో స్ప‌ష‌ల్ అట్రాక్ష‌న్ అయ్యారు. పవన్ మొదటిసారిగా లండన్ నగరానికి విచ్చేసిన సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ప‌వ‌న్‌ని ఎయిర్‌పోర్ట్ నుంచి ప‌వ‌ర్‌స్టార్ జిందాబాద్ అంటూ నినాదాలిస్తు, స్వాగ‌తం ప‌లికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్లు, రైల్వే లైన్ల పక్కనే నివసిస్తున్నారా? గుండెవ్యాధులు పొంచివున్నాయ్ జాగ్రత్త!