Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో కిట్స్(సింగాపురం), కరీంనగర్ ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మాతృభూమి మాధుర్యాన్ని, విలువల్ని గుండెల్లో పదిలంగా ఉంచుకుంటూ... '15 సంవత్సరాల' తరువాత అమెరికాలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా కలిసి తమ యొక్క కాలెజీ రోజుల్లోని మధురానుభవాలను పంచుకున్నారు. భావి ఇంజినీర్‌లలా వీరి స్నేహం 1997లో కమలా ఇనిస్టిట్యూట్ ఆఫ్

అమెరికాలో కిట్స్(సింగాపురం), కరీంనగర్  ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (13:58 IST)
మాతృభూమి మాధుర్యాన్ని, విలువల్ని గుండెల్లో పదిలంగా ఉంచుకుంటూ... '15 సంవత్సరాల' తరువాత అమెరికాలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా కలిసి తమ యొక్క కాలెజీ రోజుల్లోని  మధురానుభవాలను పంచుకున్నారు. భావి ఇంజినీర్‌లలా వీరి స్నేహం 1997లో కమలా  ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ సింగాపురం, కరీంనగర్‌లో పుట్టింది.
 
గత కొద్ది సంవత్సరాలుగా పూర్వ విద్యార్థులు అమెరికాలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశీలులుగా స్థిరపడ్డారు. ఈ కార్యక్రమానికి అమెరికాతోపాటు  ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, లండన్, కెనడాల నుంచి  42 మంది పూర్వ విద్యార్థులు సెప్టెంబరు 16-18 డల్లాస్ యూఎస్ఎలో ఏకీకృతులయ్యారు, పండుగ చేసుకున్నారు.
 
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా..." వీరి సంగమానికి సారాంశం.
 
ఈ సమ్మేలనం కార్యనిర్వహణ బాధ్యత మిత్రులంతా కలిసి చేసుకున్నారు. వీరిలో సందీప్ పంతుల, సతీష్ చంద్ర సంగోజు, రాజేష్ ఆకుతోట, హరీష్ ఎక్కాటి, భగీరత్ పెసర, సునీల్ కర్ణ, శ్రీ రాం రెడ్డి బజారు, తిరు వెంగటి, అంజిత్ బాల్మురి, విశ్వనాథ రాజు బ్రహ్మాండబేరి, రాగిని నీరుమల్ల, రేఖా రెడ్డి  గార్లపాటి , జీవన్ రేవురి, రవి తౌటం, రజ్నీష్ కాటారపు, మూర్తి తాడెపల్లి మిగితా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే...