Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు

40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:15 IST)
కరోనా వైరస్ అమెరికాను కేంద్రంగా చేసుకున్నదా అనిపిస్తోంది. అక్కడ రోజుకి వేలల్లో కరోనా వైరస్ సోకిన రోగులు మరణిస్తున్నారు. ఈ రాకాసి కరోనావైరస్ కారణంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరోవైపు ఎన్నారైలలో సుమారు 1500 మందికి కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షలు చేశారనీ, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు.
 
గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 2,108 మరణాలు సంభవించాయి. ఒకే రోజులో 2,000 కంటే ఎక్కువ COVID-19 మరణాలను నమోదు చేసిన అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది. అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 5,00,000 దాటిపోయింది.
 
అమెరికాలోని COVID-19 కేంద్రంగా మారిన న్యూయార్క్, ప్రక్కనే ఉన్న న్యూజెర్సీల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ దేశంలో భారతీయ-అమెరికన్లు వుండే అత్యధిక ప్రాంతాలుగా వున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారిలో 17 మంది కేరళకు చెందినవారనీ, 10 మంది గుజరాత్ నుండి, పంజాబ్ నుండి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, ఒరిస్సాకు చెందినవారు ఒకరు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా ఆకుల నూనెతో చుండ్రు మాయం..