Publish Date: Wed, 01 Jul 2015 (13:07 IST)
Updated Date: Wed, 01 Jul 2015 (13:08 IST)
నాట్స్ సంబరాల్లో సందడి చేయడానికి టాలీవుడ్ తారలు నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, తనికెళ్ళ భరణి, గజల్ శ్రీనివాస్, కమలిని ముఖర్జీ, నిషా అగర్వాల్, అలీ, యాంకర్ శ్యామల, ప్రముఖ సింగర్ అనూప్ రుబెన్, గీతామాధురి, హర్ష తదితరులు లాస్ఏంజిలిస్ చేరుకున్నారు.
బాలకృష్ణను రిసీవ్ చేసుకోవడానికి వందలాది అభిమానులు విమానాశ్రయానికి వచ్చారు. కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సంబరాలు, ఏర్పాట్లు చూసి బాలకృష్ణ ఆనందాన్ని వెలిబుచ్చారు. జూలై 2, 3, 4 తేదీలలో జరిగే సంబరాల కార్యక్రమాల రూపకల్పన అద్భుతంగా వుందన్నారు.