సిక్కు ఎన్నారై రాజీందర్ సింగ్ "బీఎన్పీ" తీర్థం..!
బ్రిటీష్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) వివాదాస్పద సూత్రాలను సమర్థించిన ప్రవాస సిక్కు జాతీయుడు రాజీందర్ సింగ్కు ఆ పార్టీ తీర్థం లభించనుంది. దీంతో బీఎన్పీలో చేరిన తొలి శ్వేతజాతీయేతరుడిగా రాజీందర్ రికార్డు సృష్టించనున్నారు. బ్రిటన్లో జాత్యహంకార పార్టీగా ముద్రపడిన బీఎన్పీ స్థాపించిన రోజునుంచీ.. దాంట్లో శ్వేతజాతీయులే సభ్యులుగా ఉన్నారు. అయితే.. సంవత్సరాల తరబడీ కొనసాగుతున్న ఈ పద్ధతికి రాజీందర్ చెక్ పెట్టినట్లయ్యంది.ఇటీవలి కాలంలో బీఎన్పీపై విమర్శలు తారా స్థాయికి చేరుకోవటంతోపాటు.. సెప్టెంబర్లో మానవ హక్కుల కమీషన్ చట్టపరమైన చర్యలు తీసుకున్న కారణంగా, ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నిక్ గ్రిఫిన్ తమ సిద్ధాంతాలను పునఃసమీక్షించుకునే పనిలో పడ్డారు. పైగా.. గోధుమ వర్ణ జాతీయులకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించుకోవాల్సి పరిస్థితి వారికి దాపురించింది.ఈ నేపథ్యంలో బీఎన్పీ సిద్ధాంతాలను బహిరంగంగా సమర్థించిన ఆసియా సంతతి వ్యక్తి రాజీందర్ సింగ్ను పార్టీలో చేర్చుకుని, తమపై ఉన్న మచ్చను తొలగించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు రాజీందర్ సింగ్ మాట్లాడుతూ.. బీఎన్పీ జాతి వివక్షను పక్కనబెట్టి, ఆ పార్టీకి దీర్ఘకాలంగా మద్ధతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.బీఎన్పీలో చేరటాన్ని గౌరవంగా భావిస్తున్నాననీ... ముస్లిం అనే పదాన్ని బాహాటంగా ప్రకటించగల సత్తా కేవలం ఆ పార్టీకే ఉందని రాజీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్లోని పంజాబ్ ప్రాంతం నుంచి 1967 వలస వచ్చిన సింగ్.. తనకు ముస్లింలంటే ద్వేషం లేదనీ, సిక్కు మత విశ్వాసాల ప్రకారం శత్రువును కూడా ప్రేమించాలని చెప్పారు. కాగా.. ఈ వార్తా కథనాన్ని బ్రిటీష్ డైలీ ప్రచురితమయ్యంది.