Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి న్యూఢిల్లీలో "ప్రవాసీ భారతీయ దివస్"

Advertiesment
ప్రత్యేక వార్తలు
FILE
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే "ప్రవాసీ భారతీయ దివస్" గురువారం నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు పలువురు హాజరుకానున్నారు.

పెట్టుబడులు పెట్టేలా ప్రవాస భారతీయులను ప్రోత్సహించటంపైనే ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సదస్సుకు దాదాపు పదిహేను వందలమంది దాకా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది.

పదిహేనుమంది ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవాస భారత వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం అందుబాటులోకి తేవటం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu