Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాఫ్రికాలో తూ.గో.వాసి మృతి

Advertiesment
ఎన్ఆర్ఐ
జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాకర్ హుస్సేన్ (48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాజూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన ఇతను ఆరు నెలల క్రితం మామిడి కుదురు మండలం, నగరం గ్రామానికి వలస వచ్చాడు.

నగరం గ్రామంలోనే జీవనం సాగిస్తున్న బాకర్ హుస్సేన్.. కొద్దికాలం క్రితం ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ అగ్గిపెట్టెల పరిశ్రమలో పనికి కుదిరిన ఈయన.. కొన్నాళ్లపాటు ఇక్కడి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి తన క్షేమసమాచారాలను చెబుతుండేవాడు.

అయితే గత కొన్ని రోజులుగా బాకర్ హుస్సేన్ నుంచి ఎలాంటి సమాచారమూ అందక పోవటంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనలో పడ్డారు. ఈలోగానే హుస్సేన మరణవార్త కుటుంబీకులకు తెలిసింది. అంతే వారంతా శోకసముద్రంలో మునికిపోయారు. కాగా... హుస్సేన్ దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతంలో, ఎలా చనిపోయాడన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu