పిల్లలకు, వయసు మీద పడిన వారికి ఎముకలు లేని మట్టన్ తీసుకుని వచ్చి చాప్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. శక్తికి కూడా చాలా మంచిది.
కావాల్సిన పదార్థాలుః
బోన్లెస్ మట్టన్ - 500 గ్రాములు
మిరియాలు - పిడికెడు
గరం మసాలా- కొద్దిగా
నెయ్యి- ఓ గరిటెడు
తయారీ విధానం
మొదట కూరను కొంచెం పెద్ద ముక్కలుగా నరికి నీటిలో శుభ్రం చేసి, సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత మిరియాలు, గరం మసాలా, అవసరమైన మేర ఉప్పు వేసి, రుబ్బుకోవాలి. దీనిని కూరతో కలిపి సుమారు అర్థ గంటపాటు అలాగే మూసి వేయాలి. ఇలా చేయడం ద్వారా మట్టన్తో మసాలా బాగా కలుస్తుంది.
తర్వాత స్టవ్పై ఓ పాత్ర పెట్టి, అందులో నెయ్యి వేసి, బాగా ఎండిన తర్వాత మసాలా పట్టించిన మట్టన్ను అందులో వేసి ఉడకబెట్టాలి. మట్టన్ పెనంకు అతుక్కుపోకుండా గరిటతో కలబెడుతుండాలి. మట్టన్ బాగా ఉడికిన తర్వాత కొత్తి మీర, కరివేపాకు రెబ్బలను చల్లి వడ్డించండి.