Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చట్టంపై గౌరవం లేకపోతే రాష్ట్రాన్ని వదిలిపొండి..ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోదీ అని..?: యోగి

చట్టం అంటే గౌరవం లేనివారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబుగ్గలను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని యోగి కొనియాడారు. వేగంగా చట్టాల

Advertiesment
చట్టంపై గౌరవం లేకపోతే రాష్ట్రాన్ని వదిలిపొండి..ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోదీ అని..?: యోగి
, ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:49 IST)
చట్టం అంటే గౌరవం లేనివారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబుగ్గలను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని యోగి కొనియాడారు. వేగంగా చట్టాలను మారుస్తున్నామని.. ఇంతకుముందు చెప్పినట్లుగానే చట్టం అంటే గౌరవం లేనివారు.. రాష్ట్రాన్ని వీడాలన్నారు. చట్టాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై మాట్లాడుతూ 'ప్రతి ఓటూ మోడీకే' అన్న వ్యాఖ్యకు ఇవిఎంలు కట్టుబడ్డాయని ఢిల్లీ ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి యోగి పరోక్షంగా చురకలంటించారు. ‘ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడంద్వారా ప్రజలు ఈవీఎం అంటే ‘ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోదీ’ అని నిరూపించారు. 
 
పంజాబ్‌, యూపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఈవీఎంల పనితీరుపై ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశయాదవ్‌ చేసిన ఆరోపణలు అర్థరహితమని విమర్శించారు. దేశంలో వీఐపీ సంస్కృతిని తరిమికొట్టడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ కొత్త చరిత్రకు నాంది పలికారని, ఉత్తరప్రదేశలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాపై సునీల్ మిట్టల్ ఫైర్.. ఫేస్ బుక్, ట్విట్టర్‌ను భారత్‌లో నిషేధించాలి