Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ బాటలో యోగి.. రూ. 3కే అల్పాహారం.. రూ.5కే కడుపునిండా భోజనం.. అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీ

అమ్మ బాటలో యోగి.. రూ. 3కే అల్పాహారం.. రూ.5కే కడుపునిండా భోజనం.. అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట?
, శుక్రవారం, 5 మే 2017 (17:37 IST)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీన్లు పేదలకు ఆకలిబాధను తీర్చుతున్నాయి. ఇదేవిధంగా యూపీ సీఎం యోగి కూడా పేద ప్రజల ఆకలిని తీర్చనున్నారు.  
 
ప్రజా సంక్షేమ విషయంలో ఏమాత్రం రాజీ పడని యోగి రోజు రోజుకీ దూకుడును పెంచుతున్నారు. తాజాగా పేదల ఆకలిని తీర్చడమే లక్ష్యంగా త్వరలో ఉత్తరప్రదేశ్‌లో రూ.5కే కడుపునిండా భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు యోగి సర్కారు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం కార్యాలయ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
ఈ భోజన పథకం కింద రూ.3కే అల్పాహారం ఇస్తారు. ఈ అల్పాహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తామని, తేనీరు కూడా ఇస్తామని సీఎం కార్యాలయం తెలిపింది. అన్నం, రొట్టెలు, కూరగాయలతో పాటు రుచికరమైన భోజనాన్ని మధ్యాహ్నం పూటే కాకుండా రాత్రి కూడా అందిస్తామని యూపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 200 సెంటర్లు ఏర్పాటు కానుండగా.. ఈ పథకానికి  సంబంధించిన ముసాయిదా ప్రస్తుతం తయారవుతుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ కేంద్రాలు అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట నడుస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఇంకొకరితో... వెన్నులో పొడిచి ముక్కలుగా నరికేశాడు...