Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

జూలై 22-24 వరకు వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్‌ పో

Advertiesment
image
, శుక్రవారం, 14 జులై 2023 (19:40 IST)
అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్‌ పో ప్రపంచం లోని పురాతన నగరమైన వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 22 నుండి 24, 2023 వరకు నిర్వహించబడుతుంది. టెంపుల్ కనెక్ట్ (ఇండియా) ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణకు అంకితం చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి ఈవెంట్. ఆలయ ఆవరణ వ్యవస్థల పాలన, నిర్వహణ, కార్యకలాపాలను పెంపొందించడం, సాధికారత కల్పించడంపై ఇది దృష్టి సారిస్తుంది.
 
ప్రసాద్ లాడ్ (చైర్మన్, ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ & ఎక్స్‌ పో 2023, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు)తో పాటు షో డైరెక్టర్ & కో-క్యూరేటర్ మేఘా ఘోష్‌లతో కలసి టెంపుల్ కనెక్ట్ (భారతీయ మూలాలున్న దేవాలయాల డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్, సమాచార పంపిణీకి అంకితమైన ప్రముఖ వేదిక) వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి ద్వారా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఆలయ నిర్వహణ బృందాల కోసం ఉత్తమ అభ్యాసాలను ప్రారంభించడం, ప్రచారం చేయడం కోసం ఈ మూడు-రోజుల ఈవెంట్ ఆలయ నిర్వహణలో ఉన్న సారూప్య వ్యక్తుల మధ్య ఆలోచనలు, అభ్యాసం, అమూల్యమైన అంతర్దృష్టి కోసం ఒక వేదికను రూపొందించింది.  
 
ఈ కన్వెన్షన్ ఆలయ పర్యాటకం, తీర్థయాత్ర ఆవరణ వ్యవస్థకు విలువను జోడిస్తుంది. ఇది "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" ఇనిషియేటివ్ కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా తగిన మద్దతు పొందింది. ఐటీసీఎక్స్ వివిధ అంశాలపై నిపుణుల సెమినార్లు, వర్క్‌ షాప్‌లు, మాస్టర్ క్లాస్‌ల ద్వారా నెట్‌వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, పీర్ లెర్నింగ్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆలయ భద్రత, నిఘా, నిధుల యాజమాన్యం, విపత్తు నిర్వహణ, పరిశుభ్రత, ఆరోగ్యదాయకత అలాగే సైబర్- దాడుల నుండి రక్షణ కోసం కృత్రిమ మేధ (ఏఐ) వంటి నూతన తరం సాంకేతికతను ఉత్తమంగా ఉపయోగించడం, బలమైన, కనెక్ట్ అయిన ఆలయ సంఘం కోసం సామాజిక మాధ్యమాల నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. యాత్రికుల అనుభవ గొడుగు కింద సమూహాలు, క్యూ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతుల పెంపుదల వంటి అంశాలను కూడా ఈ కార్యక్రమం చర్చిస్తుంది.
 
ఈ ఈవెంట్ ఆహ్వానం ద్వారా మాత్రమే నిర్వహించబడుతోంది. మొదటి సీజన్‌లో ఈ కార్యక్రమం హిందూ, జైన, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన దేవాలయాలు, ఆలయ ట్రస్ట్‌‌ల కోసం రూపొందించబడింది. జైన ధర్మశాలలు, ప్రముఖ భక్తి ధార్మిక సంస్థలు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ దేవాలయాల సంఘాలు, ఇస్కాన్ దేవాలయాలు, అన్న క్షేత్ర నిర్వాహకులు, వివిధ యాత్రికుల ప్రదేశాల పురోహిత్ మహాసంఘాలు, తీర్థయాత్ర ప్రమోషన్ బోర్డుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అంతేగాకుండా, భారతదేశ గొప్ప ఆలయ వారసత్వాన్ని కూడా వేడుక చేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, హస్తకళల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
 
3-రోజుల సెషన్‌ల ముఖ్యాంశాలు:
డాక్టర్ మోహన్ భగవత్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్) సదస్సును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆలయ ధర్మకర్తలు, ఆలయ బోర్డులు, ట్రస్టుల సభ్యులు, ట్రావెన్‌కోర్ యువరాజు (పద్మనాభ స్వామి ఆలయం), రోహన్ ఎ ఖౌంటే (పర్యాటక శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ప్రింటింగ్ & స్టేషనరీ, గోవా), ధర్మారెడ్డి (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- తిరుమల తిరుపతి దేవస్థానం) తదితరులు పాల్గొంటారు.
 
సమగ్ర ప్రభావాన్ని సృష్టించడానికి, సుస్థిరదాయకమైన ఆలయ నిర్వహణ, అభివృద్ధిని క్రమబద్ధీకరణకు ప్రయత్నించిన, పరీక్షించబడిన నవతరం పద్ధతులను చేర్చడానికి సెషన్‌లు రూపొందించబడ్డాయి. గ్రీన్ ఎనర్జీ, ఆర్కి యోలాజికల్ ఆర్కిటెక్చర్, లంగర్ (కమ్యూనిటీ కిచెన్) నిర్వహణ, దేవాలయాల కోసం దీపాలు మొదలైన వాటి గురించి కీలక చర్చలు కూడా ఉంటాయి. తిరుపతి బాలాజీ ఆలయ నిపుణులు తమ లోపరహిత క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి తెలియజేస్తారు. వారణాసిలోని ఘాట్‌లను శుభ్రపరిచే, నిర్వహించే స్వచ్ఛంద/సామాజిక సంస్థలు ఆ విషయాలపై జ్ఞానాన్ని పంచుకుంటాయి. యాత్రికులకు చిరస్మరణీయ అనుభవాన్ని అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను, గమ్యస్థానాన్ని ప్రోత్సహించే విధంగా పర్యాటకరంగంలో దాని విస్తరించిన పాత్రపై ఆలయ ఆర్థికశాస్త్రం పేరిట జరిగే సెషన్‌కు కన్వెన్షన్ వ్యవస్థాపకుడు, గిరేష్ కులకర్ణి సారథ్యం వహిస్తారు.
 
కాశీ విశ్వనాథ్ మందిర్, మహాకాళ జ్యోతిర్లింగ్, అయోధ్య రామమందిరం, పాట్నా సాహెబ్ గురుద్వారా, చిదంబరం టెంపుల్, విరూపాక్ష టెంపుల్ హంపి ప్రతినిధులచే సంబంధిత అంశాలపై ఇతర చర్చలు, సెషన్‌లు జరుగు తాయి.
 
ముంబయి, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల్లో సుస్థిరత, పరిశుభ్రత, ఆరోగ్యం, కమ్యూనిటీ సర్వీస్‌లలో ఎక్కువగా సీఎస్ఆర్ రంగంలో పని చేసే ఆంత్యోదయ ప్రతిష్ఠాన్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తోంది.
 
సేవ మరియు ఉత్పాదన బూత్‌లు
మెరుగైన ఆలయ నిర్వహణ కోసం సిస్టమ్‌లు, ఎస్వోపీ ల మెరుగుదలతో కూడిన పరిష్కారాలను అందించే ఎం పిక చేసిన వినూత్న ఉత్పత్తులు, సేవల జాబితాను ఐటీసీఎక్స్ క్యూరేట్ చేసింది. కార్యక్రమానికి హాజరైన వారి కోసం తమ ఉత్పాదనలను ప్రదర్శించాల్సిందిగా ఆయా  సంస్థలను ఆహ్వానించింది. వీటిలో ఫిన్‌టెక్, లావాదే వీల నిర్వహణ/మానిటైజేషన్ టూల్స్, స్క్రీనింగ్ వర్చువల్ ఇంటరాక్టివ్ మ్యాప్‌లు, ఆలయ ప్రాంగణంలో హెల్త్ ATMలు, సోషల్ మీడియా, వెబ్ టెక్నాలజీలు దేవాలయాలు తమ ఆన్‌లైన్ ఉనికి, ఆలయ నిర్వహణ కోసం రసాయన, శుభ్రపరిచే ఉత్పత్తులను నిర్వహించడంలో సహాయపడతాయి.
 
వీటిలో VAMA, హెచ్.డిఎఫ్.సి బ్యాంక్, మెటా సోషల్, డైవర్సీ కెమికల్స్, యోనో మెటా, యూనిటీ ఐఈ వరల్డ్, వేద భవన్ ఋగ్వేదాలయ, ది ఇండియన్ పూజ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, వోల్క్‌ సర టెక్నో సొల్యూషన్స్ ఉన్నాయి. టెంపుల్ కనెక్ట్, ఐటీసీఎక్స్ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భక్తి విధిలో ముందంజగా టెంపుల్ కనెక్ట్ అనేది ఒక ప్రార్ధనా స్థలంలో భక్తుని అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. విశ్వాసం ద్వారా ప్రజలను ఆకర్షించే పవిత్ర భూమికి సంబంధించి అది సజావుగా పనిచేయడం అత్యవసరం. క్యూలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి విరామంలో బెంచీలు, తాగునీటి సదుపాయం, భక్తులు ఆవరణలోకి ప్రవేశించిన క్షణం నుండి వారి అనుభవాన్ని చూసుకునే వ్యవస్థీకృత వ్యవస్థ చాలా కీలకం. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ & ఎక్స్‌ పోలో, మేము ఒక వేదికపై ఆన్-గ్రౌండ్ టెంపుల్ సైనికులను సమీకరించి నాలెడ్జ్ పోర్టల్‌లను తెరవడం ద్వారా స్ఫూర్తిని పొందేందుకు, ఉన్నతీకరించడానికి, ఆలయంలో ప్రామాణిక ఆపరేటింగ్ సిస్టమ్‌ను నెలకొల్పడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు.
 
ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ & ఎక్స్‌ పో 2023 చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు & మహారాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్ ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ, “ఐటిసిఎక్స్ ఆలయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సాధికారత కల్పించడానికి గాఢమైన ప్రయత్నం. ఇది పురాతన పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. కన్వెన్షన్, దాని మొట్టమొదటి ఎడిషన్‌లో, అటువంటి స్థాయిలో, అందరినీ ఆకర్షించేలా నిర్వహించడం నిజంగా విశేషం. ఇది సమాచార మార్పిడికి చాలా అవసరమైన స్థలాన్ని అందిస్తుంది, ఇక్కడ వివిధ ఆలయ నిర్వహణ సంస్థల ప్రతినిధులంతా ఒకేచోట చేరి, ఒకరి నుండి మరొకరు నేర్చుకోగలరు, నిపుణులతో నెట్‌వర్క్ కాగలరు, సుస్థిరమైన ఆలయ అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేసే సినర్జీలను సృష్టించుకోగలరు’’ అని అన్నారు.
 
షో డైరెక్టర్ & కో-క్యూరేటర్ మేఘా ఘోష్ మాట్లాడుతూ, “మేం ఈ కార్యక్రమం గురించి ఆలోచిస్తున్న సమయంలో మమ్మల్ని మేం కనుగొన్నాం. ఆలయ నిర్వహణ కోసం ఒక ఫోరమ్‌ను రూపొందించడానికి ఎవరూ ప్రయత్నించలేదు, కానీ ఎల్లప్పుడూ మొదటగా ఒక కార్యక్రమం జరగాల్సి ఉంటుంది. ఈ కన్వెన్షన్ మన గొప్ప ఆలయ వారసత్వంపై జాతీయ గర్వకారణ భావాన్ని తెరపైకి తెస్తుంది. నవతరం సాంకేతికతతో దానిని రక్షించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది సమయం. మేము ఒకే విధమైన మూలాలతో ఉన్న నాలుగు మతాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని మతాలు ఈ ఉద్యమంలో చేరడాన్ని మేం చూడాలనుకుంటున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన