Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం స్నేహితులకు అమ్మేశాడు.. నలుగురు నరకం చూపించారు.. బిడ్డ కోసం..?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. డబ్బుకు ఆశపడి.. తన భార్యను నలుగురు స్నేహితులకు అమ్మేసిన ఓ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని న్యూ అశోక్‌ నగర్‌లో వెల

Advertiesment
డబ్బు కోసం స్నేహితులకు అమ్మేశాడు.. నలుగురు నరకం చూపించారు.. బిడ్డ కోసం..?
, గురువారం, 2 మార్చి 2017 (17:00 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. డబ్బుకు ఆశపడి.. తన భార్యను నలుగురు స్నేహితులకు అమ్మేసిన ఓ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని న్యూ అశోక్‌ నగర్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. అశోక్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల వివాహితను ఆమె భర్త నాలుగేళ్ల పాటు నలుగురు స్నేహితులకు అమ్మేశాడు. నాలుగేళ్ల పాటు అతడి స్నేహితులు ఇంటికొచ్చి.. ఆమెను లైంగికంగా వేధించారు. ఈ వ్యవహారం తెలియరావడంతో పాటు.. బాధిత మహిళ చెప్పిన నిజాలు పోలీసులకు షాక్ నిచ్చాయి.
 
డబ్బు కోసం తన భర్త.. అతని నలుగురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చేవాడని.. వారికి తనను అమ్మేశాడని చెప్పింది. ఇలా నాలుగేళ్ల పాటు తనకు భర్త స్నేహితులు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని బయటికి చెప్తే తన నాలుగేళ్ల కుమార్తెను చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది.

బిడ్డ కోసం ఇదంతా భరించానని వెల్లడించింది. దీంతో డబ్బు పిశాచి అయిన బాధితురాలి భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9వ తరగతి విద్యార్థితో టీచరమ్మ... ఏం చేసిందో తెలుసా?