Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెడ్డం గీసుకోలేదని భర్తపై వేడి నీళ్లను పోసేసిన భార్య.. ఎక్కడ?

గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పో

గెడ్డం గీసుకోలేదని భర్తపై వేడి నీళ్లను పోసేసిన భార్య.. ఎక్కడ?
, శనివారం, 3 జూన్ 2017 (10:35 IST)
గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పోసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలీగఢ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ (32), నగ్మా భార్యభర్తలు. మత విశ్వాసం కారణంగా సల్మాన్ గెడ్డం పెంచుతూ వస్తున్నాడు. 
 
భర్త గెడ్డం పెంచడంపై శుక్రవారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నగ్మా భర్తపై మరుగుతున్న నీళ్లు పోసింది. ప్రస్తుతం సల్మాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరునెలల క్రితమే వివాహమైందని.. ఇప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
 
భర్త ఆహార్యం విషయంలో నగ్మా చేసే సూచనలను ఏమాత్రం సల్మాన్ పట్టించుకోకుండా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. కాగా, భార్య నగ్మాపై సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగ్మాపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో రాకతో.. పోర్న్‌సైట్స్, అడల్డ్ కంటెంటే ఎక్కువ చూస్తున్నారట..