Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోయంబత్తూరు : కొడుకుని కట్టేసి... మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి... 7 సవర్ల నగలు దోపిడీ

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివార

Advertiesment
Woman professor
, శనివారం, 7 జనవరి 2017 (09:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన లత (38) అనే మహిళ తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త ఓపీఎస్‌ కాలనీకి చెందిన శివలింగం భారతీయార్‌ యూనివర్శిటీలో టెక్నికల్‌ అధికారిగా పని చేస్తున్నారు. 
 
అయితే, మనస్ఫర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా నివశిస్తున్నారు. ఈ క్రమంలో లత తన కుమారుడితో కలసి ఉంటోంది. కళాశాలకు వెళ్లే సమయంలో లత కుమారుడిని అదే ప్రాంతంలో ఉన్న పుట్టింట్లో వదిలి వెళుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మనుమడు, లత ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆమె తండ్రి లత ఇంటికి వెళ్లాడు.
 
అతను వెళ్లి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి. దాంతో అతను చుట్టుపక్కల వారి సాయంతో లోనికి వెళ్లి చూశాడు. శరీరం కాలిన స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ కమిషనర్‌ సుందర్‌ రాజన్ నేతృత్వంలోని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మరో గదిలో బంధించిన ఆమె కుమారుడిని విడిపించారు.
 
కాగా, ఇంటి ప్రాంగణంలో కారపు పొడి చల్లివుండడంతో పాటు ఆమె ధరించిన 7 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. లత ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు నగల కోసం ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడి పందేలపై స్టే ఎత్తివేయలేం.. కత్తులు స్వాధీనం చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు