Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

Advertiesment
Track

సెల్వి

, శుక్రవారం, 8 ఆగస్టు 2025 (19:30 IST)
Track
తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల మహిళ తనూర్ సమీపంలో కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోవడంతో తలకు గాయమైందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె తన భర్తతో కలిసి ప్రయాణించింది. ఇంకా ఈ ఘటన కారణంగా గాయపడిన మహిళను చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. 
 
తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన ఈ జంట మద్యం మత్తులో ఉన్నట్లు, తప్పుడు రైలు ఎక్కారని పోలీసులు తెలిపారు. "ఆ మహిళకు కోయంబత్తూర్‌కు టికెట్ ఉంది, కానీ ఆమె పడిపోయిన రైలు టికెట్ ఆమె చేతుల్లో లేదు" అని తనూర్ పోలీసు అధికారి తెలిపారు.
 
సదురు మహిళ తనూర్ సమీపంలో పడిపోయింది. ఆమె భర్త పరప్పనంగడి స్టేషన్‌లో దిగి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో, ఆ మహిళకు గాయాలు ఉన్నప్పటికీ, సమీపంలోని ఇంటికి చేరుకుంది. నివాసితులు పోలీసులను సంప్రదించారు. 
 
ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తరువాత వైద్య కళాశాలకు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?