Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దె ఇంటి కోసం వెళ్తే.. భర్త కంటి ముందే ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ చేశారు..

అద్దె ఇంటికోసం వెళ్ళిన మహిళను భర్త కంటి ముందే ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో దేశ వాణిజ్య నగరమైన ముంబైలో మహిళలకు భద్రత లేదని మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయ

Advertiesment
Woman gang-raped in Mumbai
, బుధవారం, 2 నవంబరు 2016 (14:23 IST)
అద్దె ఇంటికోసం వెళ్ళిన మహిళను భర్త కంటి ముందే ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో దేశ వాణిజ్య నగరమైన ముంబైలో మహిళలకు భద్రత లేదని మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

ముంబై తూర్పు ప్రాంతంలో అద్దె ఇంటి కోసం ఓ మహిళ గాలించింది. 28 ఏళ్ల ఓ మహిళ తన భర్త, అత్తమామలు ఇద్దరు అబ్బాయిలో నివసించేందుకు అద్దె ఇల్లు చూసేందుకు తన భర్తతో పాటు వెళ్లింది. 
 
ముంబై షామ్ నగర్‌లో వీరిద్దరూ అద్దెకు ఇల్లు వెతికారు. రాత్రి కావడంతో వారికి తెలిసిన ఇంట బస చేశారు. దీన్ని గమనించిన ఆ ఏరియా యువకులు 28 ఏళ్ల మహిళపై కన్నేశారు. అంతే అర్థరాత్రి పూట 28 ఏళ్ల మహిళ బస చేసిన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. ఆమె భర్తపై చేజేసుకున్నారు. ఆపై అతని చేతులు, కాళ్లు కట్టేశారు. తర్వాత మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. కత్తి చూపించి బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ యువకుడు నమ్మించి మోసం చేశాడు... నాకు న్యాయం చేయండి : హిజ్రా ఫిర్యాదు