Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

భార్యాభర్తల గొడవ.. భార్యను హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరార్

Advertiesment
crime scene
, మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:13 IST)
భార్యాభర్తల గొడవ.. హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ హత్యకు కారణమైంది. భార్య గొంతు కోసి భర్త హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరారైన ఘటన కేరళ, ఎర్నాకులంలో చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్‌లో ఏడాదిగా అద్దెకు ఇంట్లో వుంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణికావేశానికి గురైన భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. అంతటితో వదలక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేశాడు. 
 
అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అక్టోబర్ 14న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసి నిందితుడు పారిపోయి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్‌కు కొరడా దెబ్బలు... ఎందుకని?