Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

బర్త్‌డే పార్టీకి పిలిచి లేడీ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

Advertiesment
Woman Constable
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:43 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఇపుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
 
నీముచ్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనతో వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నట్లు చెప్పింది. 
 
అతని సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. 
 
దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌ బంద్‌కు రైతు సంఘాల పిలుపు - మద్దతు ఇచ్చిన ఏపీ