Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రేమికులు

టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన

డబ్బు కోసం నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రేమికులు
, సోమవారం, 17 అక్టోబరు 2016 (14:04 IST)
టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఈ ప్రాంతానికి చెందిన పూర్ణిషా (22), మయాంక్ మెహతాలు ప్రేమికులు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో వీరిద్దరు కలిసి డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం మయాంక్ తన స్నేహితులను కూడా ఉపయోగించుకున్నాడు. 
 
తమకు వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడు భండారీని.. మోటార్ సైకిల్‌పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ.50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. 
 
దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. డబ్బుల కోసమే ఈ పని చేసినట్టు వారు పోలీసుల ఎదుట చెప్పడంతో వారిపై మోసం, కిడ్నప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్ళీ వార్తల్లోకి రాధే మా.. గంగా నదిలో పూజలు.. అదీ షూ వేసుకుని...