Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగిపై అత్యాచారం

victim
, బుధవారం, 15 జూన్ 2022 (14:33 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రక్తపోటు సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళపై ఆస్పత్రిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం అజ్మీర్‌లో జరిగింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, అజ్మీర్‌​కు చెందిన ఓ 23 ఏళ్ల మహిళ.. గత కొద్దిరోజులుగా రక్తపోటు సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల వైద్యం కోసం స్థానికంగా ఉన్న జేఎల్​ఎన్​ ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో వెళ్లింది. ఆమెను ఆస్పత్రిలో వదిలిపెట్టి ఇతర పనిమీద బయటకు వెళ్లాడు. 
 
ఇదే అదనుగా తీసుకుని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్​ ఉద్యోగి రాజేశ్​ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి సోదరుడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆమె నిస్సహాయ స్థితిలో వుంది. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేదు. దీంతో వెంటనే అతడు వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబోకు మనిషి చర్మం - 1.5 మిమీ మందంతో...