Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయీమ్ బాధితులకు గుడ్ న్యూస్.. భూములను తిరిగి ఇచ్చేస్తున్నాం.. సిట్ అధికారులు

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయ

Advertiesment
నయీమ్ బాధితులకు గుడ్ న్యూస్.. భూములను తిరిగి ఇచ్చేస్తున్నాం.. సిట్ అధికారులు
, ఆదివారం, 20 నవంబరు 2016 (10:36 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నయీమ్ అక్రమంగా ఆక్రమించుకున్న భూముల డాక్యుమెంట్లను బాధితులకు తిరిగిచ్చేయాలని సిట్, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ భూముల విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపగానే ఈ భూముల పత్రాలను తిరిగిచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది.

అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్దతూప్ర సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండగా.. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతని అనుచరులను సిట్ అధికారుల విచారణ చేస్తుండడంతో పెద్దతూప్రలో జరిగిన హత్య విషయం వెలుగుచూసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమిస్తావా? లేదా? ప్రేమించకపోతే చంపేస్తా.. విద్యార్థినికి వేధింపులు