Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే.. ఆత్మహత్య చేసుకొంటా.. బీహార్ టాపర్ హెచ్చరిక

తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు.

Advertiesment
Bihar topper
, సోమవారం, 6 జూన్ 2016 (08:32 IST)
తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. ఇటీవల వెల్లడైన బీహార్ రాష్ట్ర ఇంటర్ పరీక్షల్లో పది మంది విద్యార్థినీ విద్యార్థులు టాపర్లుగా నిలిచిన విషయం తెల్సిందే. 
 
బీహార్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన 10 మందిలో కొందరికి తగిన సామర్థ్యంలేదని, వారికి సబ్జెక్టులపై కనీస అవగాహన లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 మంది విద్యావేత్తలతో కమిటీ ఏర్పాటు చేసి.. పది మంది టాపర్లను మరోసారి పరీక్షించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో సౌరభ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. మొదటి ర్యాంకర్‌గా నిలిచేందుకు తనకు సామర్థ్యం లేదని మీడియా బయటపెట్టడంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. సౌరభ్ శ్రేష్ఠను కమిటీ పిలిపించగా.. తనను ప్రశ్నలు అడిగితే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన కమిటీ అతడిని బయటకు పంపి.. కొంత విరామం తర్వాత మళ్లీ పిలిపించింది. అయితే, కమిటీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అతడు సమాధానం చెప్పలేదని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ అపోలో హాస్పిటల్స్‌లో కిడ్నీ స్కామ్... దర్యాప్తుకు సహకరిస్తాం: అపోలో