Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న విదేశీ వనిత.. రూ.2వేలిచ్చి సాయం చేసిన వ్యక్తి..

నోట్ల కష్టాలు స్వదేశీ ప్రజలతో పాటు విదేశీయులకు తప్పట్లేదు. నోట్ల రద్దుతో భారత్‌కు వచ్చిన పర్యాటకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు

Advertiesment
India
, మంగళవారం, 22 నవంబరు 2016 (12:36 IST)
నోట్ల కష్టాలు స్వదేశీ ప్రజలతో పాటు విదేశీయులకు తప్పట్లేదు. నోట్ల రద్దుతో భారత్‌కు వచ్చిన పర్యాటకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు ఓ మంచి మనిషి సాయం చేశాడు. పాత నోట్లు తీసుకుని ఆమెకు కొత్త నోట్లు ఇచ్చాడు. నవంబర్‌ 10న గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
సామాను ఎక్కువగా ఉండడంతో విదేశీ వనిత రూ.1600 చెల్లించాల్సి వచ్చింది. ఆమె దగ్గర రూ. 500, రూ. వెయ్యి నోట్లు మాత్రమే ఉండడంతో అవి తీసుకునేందుకు ఇండిగో ఎయిర్‌ లైన్స్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియక విదేశీ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. విదేశీ మహిళ బాధను చూసిన ఓ వ్యక్తికి ఆమెకు కొత్త రూ.2వేల నోటు ఇచ్చాడు.
 
అయితే తర్జనభర్జన తర్వాత ఇండిగో ఎయిర్‌ లైన్స్ సిబ్బంది ఈ నోటు తీసుకున్నారు. ఈ ఉదంతాన్ని బీహార్‌ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదశ్‌ రాజకీయ సలహాదారు సంజయ్‌ యాదవ్‌ వెలుగులోకి తెచ్చారు. నోట్ల కష్టాన్ని తెలియజేసేందుకే ఈ ఘటనను వెలుగులోకి తెచ్చినట్లు తేజశ్వి చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై శ్మశానవాటికలో వైఫై సేవలు.. ఇకపై అంత్యక్రియలు లైవ్‌లో...