Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిండు గర్భిణి అనే కనికరం లేదు.. పొట్టపైనే కొట్టిన బీజేపీ నేత.. గర్భస్థ శిశువు మరణించింది..

నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది.

నిండు గర్భిణి అనే కనికరం లేదు.. పొట్టపైనే కొట్టిన బీజేపీ నేత.. గర్భస్థ శిశువు మరణించింది..
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:25 IST)
నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నడియా జిల్లాలోని దుబులియా పోలీసుస్టేషను పరిధిలోని తంత్లా గ్రామానికి చెందిన శంబుచంద్ర దాస్ అనే వ్యక్తి కీర్తనలను అధిక సౌండుతో పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన స్థానిక బీజేపీ పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్ తోపాటు నలుగురు వ్యక్తులు వచ్చి దాస్‌పై దాడికి దిగారు. దాస్‌ను కొడుతుండటంతో అతని సోదరి మాయారాణి (గర్భిణీ) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 
 
అంతే ఆగ్రహించిన దుండగులు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె పొట్టపై కొట్టారు. దీంతో గర్భస్థ శిశువు మరణించాడు. ఆస్పత్రిలో ప్రస్తుతం మాయారాణి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బీజేపీ ప్రధాన్ బిస్వాస్ తోపాటు నలుగురిపై దాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పళని జైలుకు రావొద్దు.. పరిపాలన సంగతేంటో చూడు.. శశికళ కబురు