28 యేళ్ళ బధిర యువతిని రేప్ చేశాడు... ఆ తర్వాత యాసిడ్ పోసి చంపేశాడు.. ఎక్కడ?
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 28 యేళ్ళ బధిర యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ యువతిపై యాసిడ్ పోసి కాల్చి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 28 యేళ్ళ బధిర యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ యువతిపై యాసిడ్ పోసి కాల్చి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
పశ్చిమబెంగాల్ రాష్ట్రం నదియా జిల్లా బేతాయి నాతున్ పరా గ్రామానికి చెందిన 28 ఏళ్ల బధిర యువతి తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తోంది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన గుర్తు తెలియని గ్రామ వ్యక్తి ఒకరు రేప్ చేశాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు విచారిస్తున్నారు.
ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రాత్రి వచ్చి కిటికీలో నుంచి యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బధిర యువతిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారినికి పాల్పడిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.