Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

water leakage

వరుణ్

, గురువారం, 4 జులై 2024 (17:27 IST)
దేశంలో మంచి ఆదరణ చూరగొన్న వంద భారత్ రైళ్ల తయారీలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో కేవలం ఆవును ఢీకొట్టగా ఇంజిన్ ముందు భాగంలో ఉండే డోమ్ ఊడిపోయింది. ఇలాంటి సంఘటనలు పలు చోటుచేసుకున్నాయి. ఇపుడు ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు పై కప్పు నుంచి నీరు లీక్ అయింది. దీంతో కొన్ని సీట్లు తడిసిముద్దయ్యాయి. ఈ సంఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
22416 అనే నంబరుతో ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కూర్చొన్న సీటు పైన రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీనివల్ల కింద ఉన్న కొన్ని సీట్లు కూడా తడిసిపోయాయి. దీన్ని చూసిన తోటి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. రైలు రూఫ్ నుంచి నీరు కారుతున్న దృశ్యాన్ని ఆ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. 
 
ఆ వీడియోలో ఆ మహిళ మీ కాలేజీలో అందరికీ చెప్పు. ఇక ఎవరూ ప్రయాణించకూడదు అంటూ మాట్లాడటం వినిపిస్తుంది. తాను పోస్ట్ చేసిున వీడియోను జతగా ఆమె ఓ క్యాప్షన్‌ను జత చేశారు. వందే భారత్ దుస్థితి చూడండి. ఈ రైలు ఢిల్లీ - వారణాసి మార్గంలో నడుస్తుంది అని క్యాప్షన్ జోడించారు. ఈ నెల 2వ తేదీన ఆ వీడియోను ఆమె పోస్ట్ చేయగా దానికి 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 
మరోవైపు. రైల్వే శాఖ దీనిపై స్పందించింది. ఏసీ పైపుల్లో తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడటంతో స్వల్ప లీకేజీ సంభవించింది. ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది దాని సరిచేశారు. అయినా ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ ఉత్తర రైల్వే పేర్కొంది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘నా 40వ పుట్టినరోజు వరకూ నేను ఉండకపోవచ్చు’ అని స్వామి వివేకానంద ఎందుకన్నారు?