Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ
, మంగళవారం, 3 అక్టోబరు 2017 (07:31 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 
 
కాగా, శశికళ భర్త వి.నటరాజన్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ... ఆసుపత్రిలో డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని ఆమె బంధువు, అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ తెలిపారు. ఒకవేళ ఆమె పెరోల్ పై వస్తే తమిళనాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీటీవీ దినకరన్‌తో పాటు.. ఆయన అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదైంది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉన్న కరపత్రాలను పంచినందుకు గాను ఈ కేసు నమోదైంది. 
 
సోమవారం సీఎం ప‌ళ‌ని స్వామి త‌మ అధికారుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా, దిన‌క‌ర‌న్‌ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ఆ కరపత్రాలను పంచారు. ఈ కేసులో ఆయ‌న‌తో పాటు మరో 15 మంది అతడి అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇ‌ప్ప‌టికే దేశ ద్రోహం కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటాచలాన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ లాస్ వెగాస్...