Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2-3 సార్లు వాడుకున్నాడు.. సాక్ష్యంగా ఉంటుందని వీడియో తీశా

2-3 సార్లు వాడుకున్నాడు.. సాక్ష్యంగా ఉంటుందని వీడియో తీశా
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:52 IST)
కర్నాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు కొత్త మలుపు తిరిగింది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన బాధితురాలు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైంది. ఆ సమయంలో ఆమె అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. తనను రమేష్ రెండు మాడు సార్లు శారీరకంగా వాడుకున్నాడని బాంబు పేల్చింది. అయితే, ఎప్పటికైనా సాక్ష్యంగా ఉంటుందని భావించి తానే వీడియో తీసి స్నేహితులకు ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. 
 
కొంతకాలం క్రితం ఓ పని నిమిత్తం తాను విధానసభకు వెళ్లిన సమయంలో మంత్రి రమేశ్ జార్కిహోళితో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఆయన తన మొబైల్ నంబర్‌ను ఇవ్వగా, దాన్ని 'మల్లేశ్వరి పీజీ' అని తన మొబైల్‌లో సేవ్ చేసుకున్నానని తెలిపింది. 
 
ఆ తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయంతోపాటు... సాన్నిహిత్యం ఏర్పడటంతో రెండుమూడుసార్లు తనను శారీరకంగా వాడుకున్నాడని తెలిపింది. అదేసమయంలో తమ ప్రాంతంలో మంత్రిగారు బలమైన నేత కావడంతో తాను ఏమీ అనలేక.. చేయలేకపోయానని వెల్లడించింది. 
 
ఈ క్రమంలో ఎప్పటికైనా సాక్ష్యాలుగా పనికి వస్తాయన్న కోణంలో ఆలోచించి, తానే ఈ వీడియోలను తీశానని చెప్పారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, అయితే, క్లాస్‌మేట్ శ్రవణ్ అనే వ్యక్తికి, నరేశ్ అనే మరో స్నేహితుడికి ఇచ్చానని, ఇంకో కాపీని దాచుకున్నానని ఆమె పేర్కొంది. 
 
కాగా, ఈ కేసులో కోర్టు అనుమతితో బాధితురాలిని భారీ బందోబస్తు మధ్య బౌరిగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి, కరోనా పరీక్షలు చేయించి, నెగటివ్ వచ్చిందని తేల్చుకుని, ఆపై సిట్ ఆఫీసులో అధికారులు విచారించారు. త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన