Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం పీఠంపై శశి ఆశకు కారణం అదే?: జయలలితను ఎంజీఆర్, రాజీవ్ ఆనాడే హెచ్చరించారా?

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... అయితే శశికళను మాత్రం నీ చెంతన ఉంచుకోవద్దు'' అంటూ ఎంజీఆర్ దీన గొంతుతో హెచ్చరించారు. శశికళ అనే మహిళ జయలలితను కీలుబ

Advertiesment
valampuri john
, గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:13 IST)
వలంపురి జాన్ అన్నాడీఎంకే ఎంపీగా కొనసాగారు. అన్నాడీఎంకే కీలక నేతలు ఎంజీఆర్, జయలలితతో ఆయన అనుభవాలను అప్పట్లో ఓ వారపత్రికలో పేర్కొన్నారు.. వలంపురి జాన్. ఈ స్టోరీ 1990లో రాయబడింది. ఆ స్టోరీలో వలంపురి జాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... అయితే శశికళను మాత్రం నీ చెంతన ఉంచుకోవద్దు'' అంటూ ఎంజీఆర్ దీన గొంతుతో  హెచ్చరించారు. శశికళ అనే మహిళ జయలలితను కీలుబొమ్మలా మార్చేసిందనే విషయం అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చెవులకు కూడా చేరింది. 
 
రాజీవ్ గాంధీ కూడా జయలలిత ఓ తమిళ కాంగ్రెస్ నేత ద్వారా శశితో స్నేహం వద్దని సమాచారం పంపారు. ఎంజీఆర్ చివరి రోజుల్లో తిరునావుక్కరసర్ కూడా జయలలితను కాపాడాలని శశికళకు సంబంధించిన వివరాలను ఎంజీఆర్‌కు అందించారు. వడుకంపట్టి ధర్మరాజు అప్పట్లో శశికళ ఆస్థాన జ్యోతిష్కుడు. ఆయన మాట శశికళకు వేదవాక్కు. ఈయనే ఓ సందర్భంలో శశికళ ఓ సందర్భంలో సీఎం అయిపోతుందని చెప్పాడు.

ఇది నిజమేనా? అనే క్లారిటీ కోసం శశికళ పలువురు జ్యోతిష్కులను కూడా సంప్రదించిందట. మరి ఈ జ్యోతిష్కుడి మాట నిజమైపోతుందా? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చిన్నమ్మకు సీఎం పీఠంపై ఆశలు ఎక్కువయ్యాయని సన్నిహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు పన్నీర్ షాక్ : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇ.మధుసూదనన్