Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో లైంగికదాడి బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న

యూపీలో లైంగికదాడి బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.. ఎందుకని?
, మంగళవారం, 6 జూన్ 2017 (10:04 IST)
ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న రాత్రి ఢిల్లీ నుంచి వస్తున్న ఓ వాహనాన్ని జేవార్‌లో దుండగులు అడ్డగించి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
 
వాహనంలోని నలుగురు మహిళలపై లైంగికదాడికి పాల్పడటమే కాక, అడ్డుకోబోయిన బంధువును కాల్చి చంపారు. కాగా ఆదివారం ఉదయం ముగ్గురు బాధితులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు వెల్లడించారు. మరో బాధితురాలు కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. మరోవైపు కేసు దర్యాప్తు కొనసాగుతు న్నదని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ లవ్‌ కుమార్‌ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. ఐస్ బ్రాండ్‌‌తో మార్కెట్లోకి..