ఉత్తరాఖండ్ కార్చిచ్చు ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో అడవులు అగ్నికి ఆహుతి కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల వేడికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు అడవుల్లో మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో నీళ్లు చల్లుతున్నా మంటల్ని అదుపు చేయలేకపోతున్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ కార్చిచ్చుల్లో ఏడుగురు మృతి చెందగా, 2269 హెక్టార్ల విస్తీర్ణ అడవి భూముల్ని అగ్ని జ్వాలలు తాకాయి. కార్చిచ్చు కారణంగా ఆల్మోరా, పిఠోరాగడ్, నైనిటాల్, చమోలీ, పౌరీ, రుద్రప్రయాగ్, టెహ్రి, ఉత్తరకాశీ అగ్నిలో దగ్ధమైనాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో రెండు ఐఏఎఫ్ ఎమ్ఐ-17 హెలికాప్టర్లను సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ అడవిలో పుట్టిన కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న 1500 గ్రామలకు పెనుముప్పుగా మారింది. అందుచేత సహాయక చర్యల్ని ముమ్మరం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ గుప్త వెల్లడించారు.