Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లిమండపం రక్తసిక్తం : తుపాకీ కాల్పుల్లో వరుడు మృతి

పెళ్లి మండపం రక్తసిక్తమైంది. వరుడుని లక్ష్యంగా చేసుకుని ఓ యువకుడు తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్‌పూర్ ఖైరీ జిల్లాలోని రామ్‌పూ

పెళ్లిమండపం రక్తసిక్తం : తుపాకీ కాల్పుల్లో వరుడు మృతి
, బుధవారం, 2 మే 2018 (08:53 IST)
పెళ్లి మండపం రక్తసిక్తమైంది. వరుడుని లక్ష్యంగా చేసుకుని ఓ యువకుడు తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్‌పూర్ ఖైరీ జిల్లాలోని రామ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామ్‌పూర్‌ మరికొన్ని క్షణాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడు పెళ్లి పీటలపై కూర్చొనివున్నాడు. మరోవైపు పెళ్లిమండటం మొత్తం మేళతాళాలతో మోర్మోగుతోంది. ఇంకోవైపు, డీజే శబ్దంతో దద్ధరిల్లిపోతోంది. ఇంతలో ఓ యువకుడు తన జేబులోనుంచి తుపాకీ తీసి వరుడుని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇందులో ఓ బుల్లెట్ నేరుగా వరుడు ఛాతిలోకి దూసుకెళ్ళడంతో పెళ్లిపీటలపైనే వరుడు ప్రాణాలు వదిలేశాడు. దీంతో పెళ్లిమండపంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. పెళ్లి కుమారుడి పేరు సునీల్‌ వర్మ (25) అని, వివాహం సందర్భంగా పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ పెట్టడంతో తుపాకీ పేలిన శబ్దం కూడా ఎవరికీ వినబడలేదని చెప్పారు. వరుడు కుప్పకూలిపోగా ఆయనను ఆసుపత్రికి తరలించారని అన్నారు. అయితే, అప్పటికే వరుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని తెలిపారు. తుపాకీ పేల్చిన యువకుడు పరారీలో ఉన్నాడని, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజా పెద్ద బఫూన్... మంత్రి కొల్లు రవీంద్ర