Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP: 15 రోజుల నవజాత శిశువును రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన 23 ఏళ్ల మహిళ.. ఎక్కడ?

Advertiesment
baby birth

సెల్వి

, బుధవారం, 10 సెప్టెంబరు 2025 (18:31 IST)
మొరాదాబాద్‌లోని కరుల ప్రాంతంలో ప్రసవానంతర మానసిక వ్యాధితో బాధపడుతున్న 23 ఏళ్ల మహిళ తన 15 రోజుల శిశువును రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ శిశువును రిఫ్రిజిరేటర్‌లో ఉంచి నిద్రలోకి జారుకున్నట్లు తెలిసింది. 
 
గత శుక్రవారం ఈ సంఘటన జరిగింది. శిశువు ఏడుపులు విన్న అమ్మమ్మ వంటగదికి పరిగెత్తుకుంటూ వెళ్లి రిఫ్రిజిరేటర్ లోపల బిడ్డను కనుగొని రక్షించింది. శిశువును వెంటనే ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమెపై దుష్టశక్తులున్నాయని ఏవేవో పరిహారాలు చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
అయినా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఆమెను సైకియాట్రిక్స్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిశోధించిన మానసిక వైద్యుడు డాక్టర్ కార్తికేయ గుప్తా మాట్లాడుతూ.. ఆమెకు ప్రసవానంతర సైకోసిస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఆమెకు ఇప్పుడు కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నట్లు ఆ వైద్యుడు తెలిపారు. ప్రసవానంతర సైకోసిస్ అనేది ప్రసవం తర్వాత సంభవించే తీవ్రమైన, అరుదైన మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితి. బాధిత వ్యక్తుల్లో భయభ్రాంతులు, గందరగోళం వంటి లక్షణాలను అనుభవించవచ్చు.
 
మానసిక వైద్యురాలు డాక్టర్ మేఘనా గుప్తా ప్రకారం, ప్రసవం తర్వాత స్త్రీలు నిర్లక్ష్యం చేయబడినప్పుడు మరియు తగినంత భావోద్వేగ మద్దతు పొందనప్పుడు ప్రసవానంతరం ఇలాంటి నిరాశతో కూడిన మానసిక స్థితి సంభవిస్తాయి. ఇది తీవ్రమైన మానసిక స్థితిలో హెచ్చుతగ్గులకు, కొన్ని సందర్భాల్లో అసాధారణ ప్రవర్తనకు కారణమవుతుంది. అటువంటి సందర్భాలలో, రోగులను మూఢనమ్మకాల వైపు కాకుండా సరైన చికిత్స కోసం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్ గుప్తా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిభావంతులైన బాలికలకు కోటక్ కన్య స్కాలర్‌షిప్‌ కు ఆహ్వానం