Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న కుమార్తె... కుటుంబ పరువు కోసం గొడ్డలితో నరికి చంపిన తండ్రి

దేశవ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా మహిళలపై అధికంగా దాడులు, మానభంగాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో ఓ తండ్రి తన కుటుంబ పరువు కోసం వివాహి

Advertiesment
UP man arrested
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (15:19 IST)
దేశవ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా మహిళలపై అధికంగా దాడులు, మానభంగాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో ఓ తండ్రి తన కుటుంబ పరువు కోసం వివాహిత అయిన కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని మహోబా జిల్లా, కుల్పాహార్ ప్రాంతానికి చెందిన మూల్‌చంద్‌ అహిర్వార్‌ అనే వ్యక్తి కుమార్తె గీతా అహిర్వార్‌. ఈమెకు గత శనివారం వివాహం జరిగింది. గతేడాది ఝాన్సీలో బంధువుల శుభకార్యానికి వెళ్లిన గీతకు అక్కడ చెందిన సునీల్‌ అనే యువకుడితో పరిచయమేర్పడి... ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి వారిద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ వచ్చారు. 
 
ఈ విషయం తండ్రి మూల్‌చంద్‌కు తెలియడంతో కుమార్తెతో పాటు.. సునీల్‌ను కూడా హెచ్చరించారు. అయినప్పటికీ గీత వివాహం తర్వాత కూడా సునీల్‌ కలుసుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆదివారం అర్థరాత్రి మూల్‌చంద్‌ లేని సమయంలో తన ప్రియురాలిని కలుసుకునేందుకు సునీల్‌.. గీత ఇంటికి వెళ్లాడు. 
 
అపుడు వారిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చూసిన మూల్‌చంద్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఇంట్లో ఉన్న గొడ్డలితో సునీల్‌, గీతలపై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుల దారుణ హత్య... యువతి నోట్లో గుడ్డలు కుక్కి నగ్నంగా చేసి...