Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

కట్నంతో పాటు కారు ఇవ్వలేదు.. అంతే ట్రిపుల్ తలాక్ చెప్పాడు..

Advertiesment
UttarPradesh
, శనివారం, 15 అక్టోబరు 2022 (18:33 IST)
ట్రిపుల్ తలాక్‌ను నిషేధం విధించినా.. తలాక్ చెప్పే వ్యక్తులు ఇంకా వున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కట్నంతో పాటు కారు ఇవ్వలేదనే కారణంతో భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడొక ప్రబుద్ధుడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్తతో సహా ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే రుబినా అనే మహిళకు ఇమ్రాన్ సైఫీతో పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. పెళ్లి జరిగి నాలుగేళ్లైనా.. భర్త, అత్తామామలు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. దీనిపై గత ఏడాదే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో అత్తింటి వారు రాజీ చేసుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్‌లో ఉద్యోగం అంటూ భార్యను పుట్టింట్లో వదిలి భర్త వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొగమంచుతో కమ్ముకున్న హైదరాబాద్..