Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలయాలు.. చర్చిలు.. మసీదుల వద్ద మద్యం విక్రయాలు బంద్.. యోగీ ఆదిత్యనాథ్

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని పవిత్ర స్థలాలైన గుడులు, చర్చిలు, మసీదుల సమీ

Advertiesment
UP CM Yogi Adityanath
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:29 IST)
ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని పవిత్ర స్థలాలైన గుడులు, చర్చిలు, మసీదుల సమీపంలో మద్యం విక్రయాలను నిషేధించారు. ఇందుకోసం కొత్త ఎక్సైజ్ విధానాన్ని తయారు చేయాల్సిందిగా అబ్కారీ శాఖ అధికారులకు ఆదేశించారు. ట
 
ఇటీవల జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను మూసివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 8,544 మద్యం దుఖాణాలను వేరే స్థలాలకు తరలించారు.
 
సీఎం మద్య నిషేధం విధించిన ప్రాంతాల్లో హిందూ పుణ్యక్షేత్రాలతో పాటు.. ముస్లిం సహా పలు మతాలకు చెందిన పవిత్ర స్థలాలు కూడా ఉండడం విశేషం. బృందావన్, అయోధ్య, చిత్రకూటం, మిశ్రిక్ నైమిశారణ్యం, పిరాన్ కలియార్, దేవ షరిఫ్, దేవ్‌బంద్ సహా తదితర పుణ్యాక్షేత్రాల్లో ఇకపై మద్య నిషేధం అమలు కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ