Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైన రెండేళ్లకు మరదలితో అక్రమ సంబంధం.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..?

పెళ్లైన రెండేళ్లకు మరదలితో అక్రమ సంబంధం.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..?
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (16:00 IST)
పెళ్లైన రెండేళ్ళకు మరదలితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే తమ బంధాన్ని పెద్దలు అంగీకరించరని తెలిసి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా గ్రామలో నివసించే రాజ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. గతేడాది పనిమీద సంబల్‌లో నివసించే తన మామ గారింటికి వెళ్లాడు.
 
అక్కడ ఉన్న సమయంలో పెళ్లి కాని భార్య చెల్లెలితో కాస్త చనువుగా ఉండటం మొదలెట్టాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
 
ఇంట్లో పెద్దలు తమ బంధాన్ని ఒప్పుకోరని తెలుసుకున్నారు. విడిపోయి దూరంగా ఉండలేమనుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేదు. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి సిధ్ధమయ్యారు. అలా ఇంటి నుంచి పారిపోయిన ఆ జోడీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఉన్న ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన బంధువులు అక్కడకు చేరుకున్నారు.
 
ఇద్దరినీ సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 366 (మహిళను కిడ్నాప్ చేయటం, పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సోకింది నాకు కాదు.. లోపలున్న వ్యక్తికి.. అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం