Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుడు పోసుకున్న వెంటనే ఆధార్ - ఆస్పత్రుల్లోనే జారీ

Advertiesment
UIDAI
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:36 IST)
దేశ పౌరుందరికీ ఆధార్ నంబరును కేంద్రం కేటాయిస్తుంది. ఇపుడు ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తున్నారు. పిల్లల చదువులకే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకం పొందేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరు తప్పనిసరి అయింది. 
 
దీంతో ఇకపై పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీచేసేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ఈ నంబరును ఆస్పత్రుల్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇదే అంశంపై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగం అధికారులతో చర్చలు జరుపుతోంది. 
 
నిజానికి ఐదేళ్ళలోపు చిన్నారులకు బయోమెట్రిక్ లేదు. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తారు. ఐదేళ్ళ తర్వాత ఆ చిన్నారి బయోమెట్రిక్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99.7 శాతం మంది (137 కోట్లు)కి ఆధార్ కార్డులు జారీచేసిటన్టు చెప్పారు. ప్రతి యేడాది రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీతో, మీ ఎమ్మెల్యే... ఆర్.కె.రోజా