Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు

crime scene
, శుక్రవారం, 1 జులై 2022 (12:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం కన్నెర్రజేసింది.

సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 
 
కాగా, బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా మెడ నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. పాకిస్థాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నూపుర్ శర్మ నోటి దురుసుతనం వల్ల దేశంలో మంట పెట్టారు.. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు' - సుప్రీం కోర్టు