Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీలో అడుగుపెడితే చంపేస్తాం : పోలీసులకు ఉత్తుత్తి కాల్

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్

Advertiesment
t​hreat call
, గురువారం, 27 అక్టోబరు 2016 (12:55 IST)
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్తానని బెదిరించాడు. కేజ్రీవాల్‌ చండీఘడ్‌ నుంచి ఢిల్లీకి మరికొద్డి గంటల్లో చేరబోతుండగా బెదిరింపులు చేసాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలిపోయింది. 
 
మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. 
 
ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతను మద్యం తాగి.. మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు' అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత సత్తా.... గొప్ప శారీరక బలం ఉన్న నేత : శశిథరూర్