Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో దారుణం: అప్పు తీసుకున్న వ్యక్తిపై దాడి... సిస్టర్స్ మృతి

gun shot
, సోమవారం, 19 జూన్ 2023 (09:01 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీసుకున్న వ్యక్తి దాడి నుంచి అన్నని కాపాడబోయిన ఇద్దరు యువతులు కాల్పులకు బలైపోయారు. ఢిల్లీలోని అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ గతంలో ఓ వ్యక్తికి పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని అతడిని శనివారం అడగగా వారి మధ్య వివాదం చెలరేగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి అప్పుతీసుకున్న వ్యక్తి మరికొందరితో వచ్చి లలిత్ ఇంటి తలుపు తట్టాడు. రాళ్లపై దాడి చేశాడు. లలిత్ సోదరుడు వెంటనే తోబుట్టువులకు, బంధువులకు సమాచారం అందించాడు.  లలిత్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో లలిత్‌ను కాపాడేందుకు అతడి సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) ప్రయత్నించి తీవ్రగాయాలపాలయ్యారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్వారంపూడీ... నీకు 'భీమ్లా నాయక్' ట్రీట్మెంట్ తప్పదు : పవన్ కళ్యాణ్