Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాక్లెట్లు అనుకుని ఎలుకల మందు తినేసిన చిన్నారుల మృతి.. ఆటోలో..

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబం

Advertiesment
Rat Poison
, బుధవారం, 19 అక్టోబరు 2016 (16:12 IST)
ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబంకీలోని ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దివ్యాంశ్(2), హృదేశ్(2)లు మంగళవారం తమ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో ఆడుకునేందుకు వెళ్లారు. ఆటోలో వారికి ఎలుకల మందు కనిపించింది. దానిని తినే పదార్థంగా భావించిన వారిద్దరూ తినేశారు.
 
కానీ ఆపై వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలయ్యారు. అయితే అప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ టాపిక్‌గా గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహ ఆహ్వానం.. అంతా కలిసి వీడియోలో స్వాగతం(Video)