Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రా టెక్కీపై బెంగుళూరులో నైజీరియన్ల అత్యాచారం

ఆంధ్రా టెక్కీపై బెంగుళూరులో నైజీరియన్ల అత్యాచారం
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:05 IST)
ఐటీ రాజధాని బెంగుళూరులో మరో మహిళా టెక్కీ అత్యాచారానికి గురైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అత్యాచారం జరిగింది. బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరిని నైజీరియాకు చెందిన అబుజి ఉబాకా, టోనీలుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను నైజీరియా రాయబార కార్యాలయానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి పంపినట్టు తెలిపారు. ఈ టెక్కీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 హైకోర్టులకు 68 మంది పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం