Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్యూషన్‌కు కోసం వచ్చిన బాలిక.. మందు తాగించి..?

, శనివారం, 6 ఆగస్టు 2022 (09:49 IST)
గుజరాత్‌లో దారుణ ఘటన జరిగింది. వడోదరలోని నిజాంపూర ప్రాంతంలోని ప్రశాంత్ ఖోస్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి స్థానికంగా ట్యూషన్ నడిపిస్తున్నాడు. అతని దగ్గర పదుల సంఖ్యలో బాల, బాలికలు ట్యూషన్‌లకు వస్తుంటారు. 
 
అయితే.. అతను గత బుధవారం.. ట్యూషన్ కోసం వచ్చిన బాలికను ఇంటిలోపలికి తీసుకెళ్లాడు. తనతో మద్యం తాగాలంటూ డిమాండ్ చేశాడు. బాలిక ఒప్పుకొక పోవడంతో బలవంతంగా ఆమె నోటిలో పోశారు. దీంతో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆతర్వాత.. ఆమెను బాలిక ఇంటిదగ్గర వదిలేసి వచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు బాలికను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ క్రమంలో.. మెలకువ వచ్చాక.. ట్యూషన్ టీచర్ పైశాచిక ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను టెస్ట్‌లో కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్యూషన్ టీచర్‌ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతీ నార్మల్ డెలివరీకి రూ.3వేలు ఇంక్రిమెంట్ : హరీష్ రావు