Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి సెంథిల్ బాలాజీ డిస్మిస్‌ - వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్

Senthil Balaji
, శుక్రవారం, 30 జూన్ 2023 (15:57 IST)
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రిమండలిలోని మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. కేంద్రం ఆదేశాలతో ఆయన జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మంత్రిమండలి నుంచి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేసే వ్యవహారంలో న్యాయ సలహా తీసుకోవాలంటూ కేంద్రం సలహా ఇచ్చింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. 
 
అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆ సమయంలో జరిగిన చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం మంత్రి సెంథిల్‌కు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిని కేబినెట్ నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం జోక్యం చేసుకుని ... బర్తరఫ్ అంశంపై తొలుత న్యాయ సలహా తీసుకోవాలని సలహా ఇచ్చింది. 
 
దీంతో గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హోల్డ్‌లో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 14వ తేదీన మంత్రిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయనను శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ గవర్నర్‌కు సీఎం స్టాలిన్ లేఖ రాయగా, ఆయన నిరాకరించారు. దీనికి ప్రతిగా సెంథిల్ బాలాజీని శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రిని డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇపుడు కేంద్ర సూచనలతో ఆయన వెనక్కి తగ్గారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ - పాన్ అనుసంధానం నేటితో పూర్తి