Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఔరంగాబాద్‌లో విషం తాగిన ఆరుగురు యువకులు

poison
, ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (09:25 IST)
బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఆరుగురు యువతులు విషం సేవించారు. వీరిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిగిలినవారి పరిస్థితి విషమంగా ఉంది. ఓ యువకుడు ప్రేమించిన యువతిని పెళ్లి చేసేకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం సేవించింది. దీన్ని చూసిన మరో ఐదుగురు యువతులు కూడా విషం సేవించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బిహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్, కాస్మా ప్రాంతానికి చెందిన ఆరుగురు యువతులు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీరిలో ఓ బాలిక యువకుడితో ప్రేమలోపడింది. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవాన్మరణానికి పాల్పడేందుకు విషం సేవించింది. అది చూసిన మిగతా ఐదుగురు యువతలు కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు బాలికలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మగధ్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని వారి వయసు 12 నుంచి 16 యేళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మిగిలిన ఐదుగురు అమ్మాయిలు ఎందుకు విషం సేవించారన్న అంశంపై విచారణ జరుపుతున్నట్టు ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు