Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.. అసెంబ్లీలోనే కానిచ్చేశారు...

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోనే పలువురు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ కేసులు నమోదు చేశారు.

ఆప్ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.. అసెంబ్లీలోనే కానిచ్చేశారు...
, శనివారం, 8 జులై 2017 (13:31 IST)
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోనే పలువురు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత నెల 28న అసెంబ్లీకి హాజరయ్యేందుకు వెళ్లిన 35 ఏళ్ల పార్టీ మహిళా కార్యకర్తపై ఆప్ ఎమ్మెల్యేలు జర్నల్ సింగ్, అమానుతుల్లా ఖాన్, సోమ్‌నాథ్ భారతీలు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ గదిలో ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ ఆ తర్వాతి రోజు పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
అమానుతుల్లా ఖాన్ తనను నేలపై పడదోసి పట్టుకుంటే జర్నల్ సింగ్ తన పొట్టపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించింది. దాదాపు అరగంట పాటు వారి వికృత చర్య కొనసాగిందని తెలిపింది. దీంతో ఆ ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, అక్రమ నిర్బంధం తదితర ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ఆర్ జయంతి.. ఇడుపులపాయలో జగన్, విజయమ్మ ఘన నివాళి