Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిని దోచుకున్నారు... వెళ్తూవెళ్తూ యువతిని రేప్ చేసి నుదుటిపై బొట్టుపెట్టిన గజదొంగ!

అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో దొంగతనాలు, రేప్‌లతో పాటు పలు వింత చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో దొంగతనానికని వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒక గజదొంగ ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్తూ వెళ్తూ... ఆ ఇం

ఇంటిని దోచుకున్నారు... వెళ్తూవెళ్తూ యువతిని రేప్ చేసి నుదుటిపై బొట్టుపెట్టిన గజదొంగ!
, శనివారం, 25 జూన్ 2016 (15:17 IST)
అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో దొంగతనాలు, రేప్‌లతో పాటు పలు వింత చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో దొంగతనానికని వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒక గజదొంగ ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్తూ వెళ్తూ... ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని అత్యాచారం చేసి ఆపై ఆమెకు కుంకుమ బొట్టు పెట్టి పారిపోయాడు. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫరుఖాబాద్ జిల్లాలో ఒక ఇంట్లోకి ఇద్దరు గజ దొంగలు దొంగతనానికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఒక యువతి మాత్రమే ఒంటరిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు పనిమీద బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దొంగలు యువతిని డబ్బు కోసం కత్తితో బెదిరించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకోవాలని ప్రయత్నించగా అందులో ఒకడు ఆమెను బలవంతంగా లాక్కెల్లి దారుణంగా అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కూడా డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయని ఆమెను బెదిరించాడు. భయంతో వణికిపోయిన ఆ యువతి ఇంట్లో ఉన్న రూ.35 వేల నగదును, కొన్ని విలువైన నగలను దొంగకు ఇచ్చింది. అన్నీ మూటగట్టుకున్న ఆ గజదొంగ వెళ్తూ వెళ్తూ యువతి నుదుటిపై కుంకుమ బొట్టుపెట్టాడు. తర్వాత ఇద్దరు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆ యువతి జరిగిన విషయాన్ని వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా మెడపై కత్తి పెడితే సహించం.. అమెరికా మెడలువంచేందుకే క్షిపణి పరీక్షలు : ఉత్తర కొరియా