Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దుల్లో భారత సైనికుడిని ముక్కలుగా నరికిన ఉగ్రవాదులు

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. భారత సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికివేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. ఈ

Advertiesment
సరిహద్దుల్లో భారత సైనికుడిని ముక్కలుగా నరికిన ఉగ్రవాదులు
, శనివారం, 29 అక్టోబరు 2016 (11:28 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. భారత సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికివేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బీఎస్ఎఫ్‌కు చెందిన ఒక సైనికుడిని అత్యంత అమానుషంగా హతమార్చింది. 
 
జమ్మూకాశ్మీర్‌లోకి చొరపడిన ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వెళ్లిన సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్‌లో సైనికుడు తల, శరీర భాగాలను ఖండించారని బీఎస్ఎఫ్ తెలిపింది. 
 
అయితే అంతకుఅంత ప్రతీకారం తీర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడి సైనికుల సమక్షంలోనే జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సరిహద్దుల్లోని కథువా సెక్టార్, కెరి, హిరానగర్‌, ఆర్ఎస్ పురా, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌‌లలో కాల్పులకు తెగబడిందని వారు తెలిపారు.
 
ఇదిలావుండగా, పాక్ చొరబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని కనిపెట్టిన భారత జావాన్లు వారిపై కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో మంజీర్ సింగ్ అనే భారత జవాను చనిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పౌడర్‌ను అక్కడ పూసుకుంటే అండాశయ కేన్సర్ వచ్చింది.. బాధితుడికి భారీగా పరిహారం.. అమెరికా కోర్టు